కర్ణాటక నుంచి ఏపీకి పాకిన హిజాబ్ వివాదం… విజయవాడలోని లయోల కాలేజీ వద్ద ఆందోళన

-

కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం జాతీయ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ వివాదం కర్ణాటక హై కోర్ట్ లో నడుస్తోంది. ఓ వర్గం విద్యార్థులు హిజాబ్ తో వస్తుండటంతో మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలతో రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ రోజుకో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. విజయవాడలోని లయోల కాలేజీలో బుర్ఖా వేసుకువచ్చిన విద్యార్థినిలను కళాశాల యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో వివాదం చెలరేగింది. ఫస్ట్ ఇయర్ లో కూడా బుర్ఖాతోనే తరగతులకు హాజరయ్యామని విద్యార్థులు అంటున్నారు. ఐడీ కార్డుల్లోనూ హిజాబ్ తోనే ఫోటో దిగామని విద్యార్థినులు చెబుతున్నారు. గతంలో లేనిది ఇప్పుడెందుకు వస్తుందంటూ… విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ముస్లిం మతపెద్దలు కళాశాల వద్దకు వచ్చారు. తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news