డ్రంక్ డ్రైవ్ లో హిజ్రాల వీరంగం..బట్టలు విప్పి, పచ్చి భూతులతో దారుణం !

-

డ్రంక్ డ్రైవ్ లో హిజ్రాలు, మందుబాబులు వీరంగం సృష్టించారు. బంజారాహిల్స్‌ పరిధిలోని పార్క్ హయాత్ దగ్గర నిన్న అర్థరాత్రి సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్‌ పోలీసులు. ఈ నేపథ్యంలోనే.. పోలీసులకు చుక్కలు చూపించారు హిజ్రాలు, మందు బాబులు. రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడేలా హిజ్రాలు రచ్చ చేశారు.

కొంత మందిని పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపిస్తూ.. రోడ్డుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. అంతేకాదు.. హిజ్రాలు బట్టలు విప్పి మరి చిందులు, పోలీసులను భూతులు తిట్టారు. ఈ రచ్చ దాదాపు మూడు గంటల పాటు సాగింది.

అలాగే… శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారుని అడ్డగించి, లోపల ఉన్నవారు బయట దిగాలని పోలీసులు హెచ్చరించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారుకు జరిమానా విధించారు పోలీసులు. మాట వినని వారిపై కేసులు నమోదు చేసి.. పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news