దసరాకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం… అన్ని రోజులా విద్యార్థులకే పండగే !

-

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం విద్యారంగంలో ఒక కీలక విషయాన్ని తెలియచేసింది. ఈ నెలలో దసరా పండుగ ఉన్నందున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవులను తెలియచేస్తూ ఒక ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు దసరా సెలవులు ఏకంగా 13 రోజులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా దసరా పండుగ కోసం దాదాపుగా రెండు వారల పాటు సెలవులు ఎప్పుడూ ఇచ్చింది లేదని తెలుస్తోంది. అంతే కాకుండా క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు సైతం సెలవులను ఇప్పుడే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ విధంగా క్రిస్మస్ సెలవులను డిసెంబర్ 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు మిషనరీ స్కూల్స్ కు సెలవులు ఇచ్చింది. కానీ ఇతర ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం కేవలం క్రిస్మన్ రోజు మాత్రమే సెలవు ఉంటుందని తెలియచేసింది ప్రభుత్వం.

ఇక ఆ తర్వాత రానున్న సంక్రాంతికి 6 రోజులు సెలవులు ఇవ్వనుంది. ఈ సెలవుల గురించి తెలుసుకున్న విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news