మధ్యాహ్న భోజనంలో తేనే, పుట్టగొడుగులు !

-

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం మెనూలో రెండు పోషకమైన ఆహార పదార్ధాలను చేర్చనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పిల్లలకు తేనె, పుట్టగొడుగులు అందించాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది.

గత 12 ఏళ్లుగా దేశంలో తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని.. వీటిని పిల్లలకు అందించడం ద్వారా వారికి మానసికంగా, శారీరికంగా సరైన ఎదుగుదల ఉంటుందని వ్యవసాయ శాఖ సూచనలు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన సూచనతో ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం ఆ రెండింటిని మధ్యాహ్న భోజనంలో చేర్చింది. అంతేకాదు దీని కోసం 15 శాతం అదనపు నిధులను కావాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. కాగా, దేశవ్యాప్తంగా 11.59 కోట్ల మందికి మధ్యాహ్న భోజనం అందుతోంది.

– శ్రీవిద్య

Read more RELATED
Recommended to you

Latest news