హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చారు : మంత్రి పొన్నం

-

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తీసుకొచ్చారు అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో 2024-25 బడ్జెట్ పద్దు చర్చ సందర్భంగా మాట్లాడారు. నగరానికి రూపాయి కూడా తీసుకురాలేని వాళ్లు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందన్నారు.

హైదరాబాద్ నగరానికి కేంద్రం ఏం ఇస్తుందో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం. గతంలో టూరిజం మంత్రిగా హైదరాబాద్ కు ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇబ్బందులు లేకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్థామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసన తెలుపుతున్నామన్నారు. విహార యాత్రకు వెళ్లినట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ నేతలు వెల్లారని సెటైర్లు వేసారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. హైదరాబాద్ కు రూ.10వేల కోట్లు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యావాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news