రవితేజ చిత్రానికి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్న మేకర్స్..ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే!

-

మాస్ మహారాజా రవితేజ..టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఇటీవల ‘ఖిలాడీ’గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన రవితేజ..ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ గ్రామం సెట్ కోసం మేకర్స్ రూ.7 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. యాక్సన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం బందిపోటు నాగేశ్వరరావు బయోపిక్. కాగా, ఇందులో రవితేజ డిక్షన్, యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో రవితేజ సిక్స్ ప్యాక్ బాడీ చూపించనున్నట్లు సమాచారం. ఇక ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్నది. వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం ఈ నెల 17న విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వలన పోస్ట్ పోన్ అయింది. నూతన విడుదల తేదీని త్వరలో నిర్మాతలు ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news