తెలుగు హీరోలతో నటించాలని ఉంది..మనసులో మాట బయటపెట్టిన నజ్రియా

-

మాలీవుడ్ (మలయాళ) ముద్దుగుమ్మ నజ్రియా..నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికీ’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నది. ఈ నెల 10న ఈ పిక్చర్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర విశేషాలను పంచుకుంటున్నది.

ఈ క్రమంలోనే  ఓ ఇంటర్వ్యూలో నజ్రియా టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎలాంటి ఆపర్స్ లేదని స్పష్టం చేసిన నజ్రియా..భవిష్యత్తులో తనకు తెలుగు హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో నటించాలని ఉందని చెప్పేసింది.

నజ్రియా భర్త ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’ చిత్రంతో ‘భన్వర్ సింగ్’ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కాగా, నజ్రియా ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ‘లీల’గా ప్రేక్షకులను పలకరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్..డెఫినెట్ గా హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.

 

Read more RELATED
Recommended to you

Latest news