షాకింగ్… భార్య కండ్ల‌లో ఆనందం కోసం ప్రియుడితో పెళ్లి జ‌రిపించిన‌ భ‌ర్త‌..!

-

పెళ్లి తర్వాత తన భార్య ముఖం లో ఆనందం కనిపించలేదు. పెళ్లి జ‌రిగి ఆరు నెలలైనా భర్త తో సంతోషంగా లేదు. దాంతో అసలు కారణం ఏంటని ప్రశ్నించగా భార్య ఇచ్చిన ఆన్సర్ చూసి భర్త షాక్ అయ్యారు. అప్పటికే తాను ఒకరిని ప్రాణంగా ప్రేమించాను అని చెప్పడంతో భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య తల్లిదండ్రులను…అదే విధంగా ప్రియుడి తల్లిదండ్రులను ఒప్పించి ఇద్దరికీ దగ్గరుండి మ‌రీ వివాహం జరిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది.

కాన్పూర్ కు చెందిన కోమల్ పంక‌జ్ భార్యాభర్తలు. వీరికి ఆరు నెలల క్రితం పెళ్లయింది. అయితే పెళ్లి జరిగిన నాటి నుండి భార్య ముఖం లో ఆనందం కనిపించలేదు. దాంతో అసలు సమస్య చెప్పాలని కోరారు. అంతేకాకుండా నీ సంతోషమే నా సంతోషం అంటూ భర్త భార్యకు హామీ ఇచ్చాడు. దాంతో కోమల్ తాను పింటూ అనే వ్యక్తిని ప్రేమించానని ఇప్పటికీ అతడిని ప్రేమిస్తున్నానని… అతడిని మర్చిపోలేక పోతున్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమ విషయాన్ని త‌న తల్లిదండ్రులకు చెప్పినా కూడా వినకుండా తనకు పెళ్లి చేశారని కోమ‌ల్ ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో భార్య బాధను అర్థం చేసుకున్న భర్త ఆమె ప్రేమించిన యువకుడు పింటూతో మాట్లాడాడు. త‌న భార్య ఆనందం కోసం పింటూతో వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాడు.

మీరు సంతోషంగా ఉంటే నాకు కావలసింది ఏముంది అంటూ భార్య‌తో చెప్పాడు. పింటూ కుటుంబసభ్యులను మరియు తన భార్య కుటుంబ సభ్యులను వివాహానికి ఒప్పించాడు. అనంతరం భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి పెద్దగా వ్యవహరించి గుడిలో ఘనంగా పెళ్ళి జరిపించాడు. ఇక ఈ వార్త కాస్తా వైల‌ర్ అవ్వ‌డంతో ఆ భ‌ర్త తీసుకున్న నిర్ణ‌యం పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అత‌డిది చాలా పాజిటివ్ థింకింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news