రాజేంద్రనగర్‌లో విషాదం. భార్య కళ్ల ముందే బిల్డింగ్‌పై నుంచి దూకిన భర్త

-

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య చూస్తుండగానే భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సాయంతో అతడి భార్య ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మూడ్రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?

రాజేంద్రనగర్‌లో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీరంచెరువులో సిద్ధప్ప అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నాడు. మూడ్రోజుల క్రితం తన భార్యతో ఏదో విషయంలో చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సిద్ధప్ప క్షణికావేశంలో.. భార్య చూస్తుండగానే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news