హుజూరాబాద్ అప్డేట్: 10 వ రౌండ్ లో బీజేపీ లీడ్

-

హుజూరాబాద్ లో బీజేపీ పార్టీ అంతకంతకు లీడ్ ను పెంచుకుంటూ వెళ్లోంది. తాజాగా జరిగిన 10వ రౌండ్ లో కూడా బీజేపీనే ఆధిక్యతను ప్రదర్శించింది. ఇప్పటి వరకు జరిగిన 10 రౌండ్ లలో కేవలం ఒకే ఒక్క రౌండ్ లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆధిక్యతను సాధించింది. తాజాగా జరిగిన 10వ రౌండ్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కన్నా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 526 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించారు. మొత్తం పది రౌండర్లను పరిశీలిస్తే బీజేపీకి 5631 ఓట్ల మెజారిటీ ఉంది.

Huzurabad | హుజురాబాద్

ప్రస్తుతం వచ్చిన కౌంటింగ్ రిజల్ట్ ను బట్టి 44647 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి 39016 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 10 నుంచి 16 రౌండ్లలలో జమ్మికుంట రూరల్, అర్బన్ ప్రాంతాల్లోని ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. అయితే ఈ జమ్మికుంట మండలంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, స్వల్పంగా బీజేపీకే మొగ్గు ఉంటుందని పార్టీలు భావించాయి. అందుకు అనుగుణంగానే ఫలితాలు అలాగే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news