ఓటు వేస్తూ ఫోటో తీసిన ఈటల అభిమాని..క్రిమినల్‌ కేసు ఫైల్‌ !

-

ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో…గంటకో పరిణామం చోటు చేసుకుంటుంది. కాసేపటి క్రితమే.. హుజురాబాద్‌ నియోజక వర్గంలోని వీణ వంక మండలంలో బీజేపీ పార్టీ మరియు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక తాజాగా బీజేపీ పార్టీ నేత, ఈటల రాజేందర్‌ అభిమాని పోలింగ్‌ కేంద్రం లో హల్‌ చల్‌ చేశాడు.

హుజురాబాద్ లోని ఓ పోలింగ్ కేంద్రం బీజేపీ కి ఓటు వేసి ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈటెల అభిమాని. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియా లో వైరల్‌ గా మారింది.

అయితే.. పోలింగ్ కేంద్రం లోకి సెల్ ఫోన్ అనుమతించడం పై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం చేసింది….. ఫోటో తీసిన వ్యక్తిని గుర్తించి క్రిమినల్ కేసు పెట్టె యోచనలో ఎన్నికల కమిషన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఉదయం 11 గంటల వరకు 33 శాతం పోలింగ్‌ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news