బద్వేల్ బై పోల్: 11 గంటల వరకు 21 శాతం పోలింగ్

-

ఉదయం నుంచి బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగానే కొనసాగుతోందని… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ పేర్కొన్నారు. ఇక ఉదయం 11 గంటల వరకు బద్వేల్‌ లో 21 % పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. మాక్ పోలింగ్ సమయం లో ఒకటి రెండు పని ఈవీఎమ్ లు పని చేయకపోతే వెంటనే రిప్లేస్ చేశామని వెల్లడించారు.

badvel

ఎక్కడా ఈవీఎమ్ లు మొరాయించి పోలింగ్ ఆలస్యం అయిన సంఘటన ఎదురవలేదన్నారు ఎన్నికల అధికారి కె. విజయానంద్. ఉదయం 9 గంటల వరకు 10.49% పోలింగ్ నమోదయ్యిందని.. ఆ తర్వాత కాస్త పుంజుకుందన్నారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని…. దొంగ ఓటర్లు వంటి సంఘటనలు జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు ఎన్నికల అధికారి కె. విజయానంద్. ఇంత వరకు మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఇక అటు హుజురాబాద్‌ నియోజక వర్గంలో పోలింగ్‌ శాతం… ఉదయం 11 గంటల వరకు 33 శాతం నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news