రేపే హుజూర్‌నగర్ ఫలితాలు.. కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

-

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ 21న ముగిసిన విష‌యం తెలిసిందే. లంగాణలోని హుజూర్‌నగర్‌లో 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ఇక రేపు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. దీనికోసం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. మధ్యాహ్నాం 2గంటల లోపే ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news