బంజారాహిల్స్ పీఎస్ కు నూతన ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వర్ రావు

-

హైదరాబాద్ రాడిసన్ పబ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలన కలిగించింది. ఈ పబ్ లో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈకేసుల బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్ పెక్టర్ శివచంద్రను సీపీ సస్పెండ్ చేశారు. తాజాగా బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వర్ రావు నియామించారు ఉన్నతాధికారులు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఈయన్ను బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ గా నియమించారు. పబ్ లో డెకాయ్ ఆపరేషన్ చేసిన టీంలో ఇన్ స్పెక్టర్ గా ఉన్నారు నాగేశ్వర్ రావు. డ్రగ్స్ వ్యవహారాన్ని బట్టబయటు చేసిన విషయంలో కీీలకంగా వ్యవహరించారు. నాగేశ్వర్ రావు గతంలో కూడా ఎన్నో సంచలన కేసులను ఛేదించిన రికార్డ్ ఉంది. ఈకేసులో నిర్లక్ష్యం వ్యవహరించిన సీఐ శివచంద్రపై గతంలో కొన్ని ఆరోణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పబ్స్ పై సరైన నిఘా పెట్టలేదనే ఆరోపణలు ఉండటంతో పాటు సెటిల్మెంట్ ఆరోపలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాడిసన్ పబ్ కేసును కొత్తగా వచ్చిన నాగేశ్వర్ రావు విచారించనున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news