విజృంభించిన హైద‌రాబాద్‌.. పంజాబ్ టార్గెట్ 202..

-

దుబాయ్‌లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 22వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ భారీ స్కోరు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

hyderabad made 201 runs against punjab in ipl 2020 22nd match

హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెన‌ర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్న‌ర్‌లు అద్భుతంగా రాణించారు. మొద‌టి వికెట్ కు వారు ఏకంగా 160 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. జానీ బెయిర్‌స్టో 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 97 ప‌రుగులు చేయ‌గా, వార్న‌ర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 52 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ జ‌ట్టు భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక పంజాబ్ బౌలర్ల‌లో ర‌వి బిష్ణోయ్ 3 వికెట్లు తీయ‌గా, అర్ష‌దీప్ సింగ్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ష‌మీకి 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news