హైదరాబాద్ టు షిరిడీ టూర్ ప్యాకేజీ.. ఈ ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు..!

-

షిరిడీ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే షిరిడీ వెళ్లే భక్తులు ఇదే గుడ్ న్యూస్. షిరిడి తో పాటుగా ఈ ప్రదేశాలని కూడా చూసి వచ్చేయచ్చు. సాయిబాబా దర్శనంతో పాటు సమీపంలోని నాసిక్, త్రయంబకేశ్వర్ కూడా వెళ్లి రావచ్చు. ఎన్నో టూర్ ప్యాకేజీలని తెలంగాణ టూరిజం ఇప్పటికే తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలతో షిరిడి తో పాటుగా వీటిని కూడా చూసి వచ్చేయచ్చు. రెండు రోజుల్లో ఈ మూడు ప్రాంతాలను చూసి రావచ్చు. హైదరాబాద్ నుంచి షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్ టూర్ ప్యాకేజీ ని ఇస్తోంది.

హైదరాబాద్‌ లోని వేర్వేరు ప్రాంతాల్లో తెలంగాణ టూరిజం టూరిస్ట్ బస్సు ఎక్కాలి. ప్యాకేజీ ధర రూ.3,100 మాత్రమే. ఇక ఏయే ప్రదేశాలు కవర్ అవుతాయో చూస్తే.. మొదటిరోజు హైదరాబాద్ లో బస్సు ఎక్కితే రెండో రోజు ఉదయం 7.30 గంటలకు షిరిడీ రీచ్ అవుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత భక్తులు
సొంత ఖర్చులతోనే సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవాలి. రాత్రి కి షిరిడీలోనే బస చేయాలి.

మూడో రోజు నాసిక్, త్రయంబకేశ్వర్ వెళ్ళాలి. జ్యోతిర్లింగ ఆలయ దర్శనం తర్వాత హైదరాబాద్‌కు మళ్ళీ ప్రయాణం ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ డే హైదరాబాద్ రీచ్ అయ్యిపోతారు. టూర్ కూడా ముగిసిపోతుంది. ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. టూరిజం షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్ టూర్ ప్యాకేజీ ధర రూ.3,100, పిల్లలకు రూ.2,530 చెల్లించాలి. కేవలం షిరిడీకి ప్యాకేజీ అయితే రూ.2400. ఇందులో కేవలం షిరిడీ మాత్రమే కవర్ అవుతుంది. మరిన్ని వివరాలను https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌ లో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news