హైపర్ ఆదిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..బో**డు అంటూ..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తెలుగు అమ్మాయిలకు ఇవ్వడం లేదు అంటూ మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్నంగా బైఠాయించి.. పాపులారిటీ దక్కించుకున్న శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు తనని చాలామంది అవకాశాల పేరుతో వాడుకున్నారు అని తనను శారీరకంగా వాడుకున్న వారి పేర్లు కూడా బయటకు పెట్టి మరొకసారి ఫేమస్ అయ్యింది. అటు రాజకీయా విషయాల పై కూడా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి తన మాటలతో చుక్కలు చూపిస్తూ ఉంటుంది.

అయితే ఇప్పుడు ఒక విషయంపై స్పందించిన శ్రీ రెడ్డి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పై ఒక రేంజ్ లో విరుచుకుపడింది. వీడిది కుక్కబుద్ది అంటూ తన నోటికి పని చెప్పింది. జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది.. మాటకి మాట పంచ్ వేస్తూ బుల్లితెర బ్రహ్మానందంగా పాపులర్ అయ్యాడు. అయితే జబర్దస్త్ స్కిట్స్ లో భాగంగా చాలాసార్లు వివాదాల్లో కూడా చిక్కుకొని బయటపడ్డాడు. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి చేతికి చిక్కిపోయి అడ్డంగా బుక్కయ్యాడు.

తాజాగా జగన్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంబరాలు చేయగా మంత్రి రోజా కూడా జబర్దస్త్ ఫ్యామిలీని ఆహ్వానించింది. అక్కడికి హైపర్ ఆది, ఆలీ , అనసూయ, మహేష్, రోహిణి హాజరయ్యారు. అయితే ఇందులో ఆది జగన్ గురించి ఏం చెప్పలేదు. దీంతో ఆదిని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. “బోకు గాడు.. కుక్క బుద్ధి చూపించాడు.. డబ్బిస్తే ఏ గడ్డైనా తింటావా? రోజా గారు పిలిచారు కావచ్చు.. అయితే మాత్రం ఎగోస్కొని వస్తావా? డబ్బులు ఇస్తే ఏదైనా ఓకే నా నీకు? అంటూ తన నోటికి పని చెప్పింది. ఆడవాళ్లను అగౌరవపరిచే వీడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు.. అంటూనే కొంపతీసి వైసిపి లోకి మారిపోయావా ? అంటూ కూడా పంచ్ వేసింది. మొత్తానికైతే శ్రీరెడ్డి నోటికి చిక్కి హైపర్ ఆది బుక్కయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news