బిజెపి మునుగోడులో అడుగు పెడితే మత కల్లోలాలు సృష్టిస్తుంది – ఉత్తమ్

-

మునుగోడులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు నల్గొండ ఎంపీ, మాజీ పిసిసి చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. తెరాస రైతు వ్యతిరేక విధానాలతో రైతు ఆత్మహత్యలు తెలంగాణలో పెరిగిపోయాయని అన్నారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవని మండిపడ్డారు ఉత్తమ్. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఏనాడు నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

టిఆర్ఎస్ తో దోస్తీ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు క్రాంటాక్ట్ పనులను రాజగోపాల్ రెడ్డి దక్కించుకున్నాడని విమర్శించారు. చర్లగూడెం ముంపు బాధితులను ఆదుకునే విషయంలో రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మండిపడ్డారు. ఐదు శాతం జీఎస్టీతో చేనేత కార్మికుల పొట్ట కొట్టిన పార్టీ బిజెపి.. ఆ పార్టీతో రాజగోపాల్ రెడ్డి జతకట్టడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్న బిజెపి రైతులను మాత్రం నడీ రోడ్డున పడేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో కొత్త ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందన్నారు.

ఏం అభివృద్ధి చేశారని మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి, టీఆర్ఎస్ లు ప్రజలను ఓట్లు అడుగుతాయని మండిపడ్డారు ఉత్తమ్. బిజెపి మునుగోడులో అడుగుపెడితే మత కొల్లోలాలు సృష్టిస్తుంది…. తిప్పి కొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందన్నారు. మతకల్లోలాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బిజెపి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ వాడిన పదజాలం, చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news