జగన్ బహిరంగ సభలకు వెళ్లకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారు : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్లలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..జగన్ తీరుతో ఏపీకి మొండెం ఉంది కానీ తల (రాజధాని) లేకుండా పోయిందనీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుండి పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నారని.. ప్రజలకు రూ.10 ఇచ్చి.. రూ.100 తీసుకుంటున్నారని మండిపడ్డారు.ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని ,వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఎన్నికల ప్రచారం కోసం ఒక్కొ మీటింగ్‌కు జగన్ రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.వైసీపీలో కొందరు మంచివాళ్లు.. మరికొందరు రౌడీలున్నారని.. ఆ రౌడీలు మనకు వద్దని ఆయన పిలుపునిచ్చారు. జగన్ బహిరంగ సభలకు వెళ్లకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం మరీ ఉన్మాదంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news