10 రోజుల్లో రాజాసింగ్ ని విడుదల చేయకుంటే హైదరాబాద్ ను ముట్టడిస్తాం – అఖిల భారత శ్రీరామ్ సేన

-

పదిరోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తామన్నారు అఖిల భారత శ్రీరామ్ సెనా జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ మూతాలిక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజాసింగ్ ను కలవడానికి జైల్ కి వెళ్తే అనుమతించలేదని…దీన్ని మేము తీవ్రంగా కండిస్తున్నామన్నారు. రాజాసింగ్ ఏమైనా టెర్రరిస్టా…ఏంటి అస్సలు ఎందుకు కలవనియారు? అని ప్రశ్నించారు. కర్ణాటక నుండి రాజాసింగ్ ను కలవడానికి వస్తే మూలకత్ కు అనుమతించలెదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర గౌర్నమెంట్ ఒక ఎమ్మెల్యే పై అక్రమ పిడియాక్ట్ పెట్టడం మేము తీవ్రంగా కండిస్తున్నామన్నారు. రాజాసింగ్ కు జైల్ లో ఎలాంటి సౌకర్యాలు లేవని.. రాజాసింగ్ కు ఏమి జరిగిన ప్రభుత్వం, కేసీఆర్ ఏ బాద్యత వహించాలని హెచ్చరించారు. ఒక హిందువు ఎమ్మెల్యే పై ఇలాంటి అక్రమ కేసులు పెట్టి జైల్ కు తరలించడం పై భారత దేశ హిందువులందరిని ఏకం చేస్తామన్నారు.

రాజాసింగ్ పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే..లక్షలాది మందితో హైద్రాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అందులో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఒక ముస్లిం మునవర్ ఫారూఖ్ అలీ హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఎలా ఉరుకుంటామని.. హిందూ దేవుళ్లను కించపరిచిన మునవర్ ఫారుకీ షోకు ప్రభుత్వం ఎందుకు పరిమిషన్ ఇచ్చింది? అని ప్రశ్నించారు. హైద్రాబాద్ లో ఆందోళనకు కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆరోపించారు.

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లపై ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. మేము రాజాసింగ్ కు మద్దతుగా నిలుస్తాం…హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పది రోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే…దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరితో కలసి10రోజుల్లో హైద్రాబాద్ ను ముట్టడిస్తామన్నారు. రాజాసింగ్ ను హత్య చేసే కుట్ర కొనసాగుతున్నదని..ఒక వేళ రాజసింగ్ కు ఏమి జరిగిన హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news