రాజగోపాల్ రెడ్డి పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు – పాల్వాయి స్రవంతి

-

మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పద్ధతిని మార్చుకోకుంటే తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. బుధవారం సాయంత్రం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి సహనాన్ని కోల్పోయి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్న రాజగోపాల్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

మునుగోడు అభ్యర్థి కేటీఆర్ నా,హరీష్ రావునా లేదా జగదీశ్ రెడ్డా అని మునుగోడు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని విమర్షిస్తున్న వారికి ఆయన పేరు ఉచ్చరించే అర్హత లేదన్నారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను ప్రలోభాలకు గురి చెయ్యకుండా ఎన్నికలకు పోదాం అని అందరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వద్ద ప్రమాణం చేద్దామా? అని టీఆరెస్, బీజేపీ లకు సవాల్ విసిరారు. నీను స్వలాభం కొరకు అమ్ముడు పొయ్యే వ్యక్తిని కానన్నారు పాల్వాయి స్రవంతి.

Read more RELATED
Recommended to you

Latest news