దేశం సరైన దిశలో వెళ్తుంటే.. ఆంధ్ర ప్రదేశ్ రివర్స్ లో వెళ్తుంది : చంద్రబాబు

-

విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ టీడీపీ రూపొందించింది. tdpforandhra.com పేరుతో విరాళాలు సేకరించనున్నారు. ఇక, విరాళాల వెబ్ సైటును చంద్రబాబు లాంచ్ చేశారు. ఈ మేరకు పార్టీకి వెబ్ సైట్ ద్వారా రూ. 99,999 మేర తొలి విరాళాన్ని చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ పై చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్ చేశారు.ఆంధ్ర ప్రదేశ్ లో గత 5 ఏళ్లలో జగన్ తప్ప ఎవరూ బాగుపడలేదని టీడీపి అధినేత చంద్రబాబు ఆరోపించారు.

 

ప్రతి ఒక్క వర్గం నష్టపోయింది. దేశం సరైన దిశలో వెళ్తుంటే.. ఆంధ్ర ప్రదేశ్ రివర్స్ లో వెళ్తుంది అని ఆరోపించారు.జగన్ పై జనంలో అసహనం కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ని ఇలా చేసిన వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు అని అన్నారు. ప్రతి ఇంటిపై కూటమి జెండాలు ఎగురవేయాలి. రేపట్నుంచి నేను, పవన్ ప్రచారంలో పాల్గొంటాం’ అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news