అడ్డం వస్తే సైకిల్ తో తొక్కించుకొంటు వెళ్తా : చంద్ర బాబు

-

రాజంపేట ఎంపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అభ్యర్థి జయచంద్రా రెడ్డిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు.అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొరుసు కాపులు ఎక్కువగా ఉన్నందునే జయచంద్రా రెడ్డి కి టికెట్ ఇచ్చానని అన్నారు.నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎంపీ గా కిరణ్ ని టచ్ చేయగలడా ఈ పెద్దిరెడ్డి ఫామిలీ అని,కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చా అని విమర్శించారు.

గతంలో నువ్వు ఇదే అంగళ్లు మీద పాదయాత్ర చేశావ్.. అప్పుడు నేను కన్నెర్ర చెసి ఉంటే నువ్వు పాదయాత్ర చేసేవాడివా అని మండిపడ్డారు. తంబల్లపల్లి ఎవ్వరి జాగిరి కాదన్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా చెపుతున్న అంగళ్లు కు వస్తూనే ఉంట అడ్డం వస్తే సైకిల్ తో తొక్కించుకొంటు వెళ్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసినా నా మీదే అక్రమ కేసు బనాయించారని ,ఆంబోతుల చేతులలో తంబల్లపల్లి సర్వ నాశనం అయ్యిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news