కష్టపడి ఇల్లు కొంటే.. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. వాణీ భోజన్..!

-

ప్రస్తుతం వెబ్ సిరీస్ క్వీన్ గా వెలిగిపోతున్న నటి వాణి భోజన్ టీవీ యాంకర్ గా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెర నటిగా కొన్ని సీరియల్స్ లో నటించింది దీంతో సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈమె ఓ మై కడవలే చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది తర్వాత నటుడు విక్రమ్ కు జంటగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మహాన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ సినిమా నిరాశ మిగిల్చింది. కారణం ఆమె పాత్రను పూర్తిగా ఎడిటింగ్ పార్ట్ కే పరిమితం చేశారు చిత్రవర్గాలు.

తాజాగా ఈమె సెంగళం వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కాగా వ్యక్తిగతంగా ఈమె ఒక నటుడితో ప్రేమ, లివింగ్ రిలేషన్ వంటి వార్తలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. నటుడు జై తో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈమె కాల్ షీట్ వ్యవహారం కూడా ఆయనే చూసుకునే వారని.. ఇతరులు ఎవరు ఆమెతో సంప్రదించే అవకాశం కూడా ఉండేది కాదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దీనివల్లే వాణి భోజన్ కు అవకాశాలు తగ్గిపోయాయి అన్న వార్తలు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే నటుడు జైతో లివింగ్ టుగెదర్ ప్రచారాన్ని ఆమె ఖండిస్తోంది.. దీని గురించి ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను నటుడు జై ట్రిపుల్ వెబ్ సిరీస్ లో నటించామని అలాగని ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించింది.ఇక తాను కష్టపడి బ్యాంకులో లోన్ తీసుకొని మరి ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో నివసించకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతనితో లివింగ్ టుగెదర్ లో ఉంటున్నానని రాయడం చాలా చీప్ గా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news