ఇలా చేస్తే ఉచితంగానే రూ.50 వేలు పొందొచ్చు: కేంద్రం..!

-

కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే విషయాన్ని చెప్పింది. దీనితో రూ.50 వేల క్యాష్ రివార్డు పొందొచ్చు. అసలు ఎందుకు డబ్బులు వస్తాయి..?, ఎం చెయ్యాలి..? ఇలా అనేక విషయాలని మనం ఇప్పుడే పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల లోకి వెళ్ళిపోతే… కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది.

దీనిలో కనుక గెలిస్తే రూ.50 వేలు పొందొచ్చు అని కేంద్రం వెల్లడించింది. పైగా ఎవరు ఎక్కడకి వెళ్లాల్సిన అవసరం కూడ లేదు. కేవలం ఇంట్లో ఉంటే మీరు దీనిని చెయ్యచ్చు. ఇలా ఈ డబ్బులు గెలుచుకునే ఛాన్స్ అందుబాటు లో ఉంది.

ఇక ఈ పోటీ కి సంబంధించి రూల్స్ ని చూస్తే… ఒక లోగో గీయాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్‌కు ఒక లోగో వేసి ఇవ్వాలి. ఇందులో గెలిస్తే కనుక రూ.50000 పొందవచ్చు. ఆసక్తి ఉంటే గెలిచి డబ్బులు పొందే మంచి ఛాన్స్ ఇది. మీకు మే 31 వరకు గడువు ఉంది.

తొలి విజేతకు రూ.50 వేలతోపాటు ఒక సర్టిఫికెట్ కూడా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఈ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. మై గౌ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

మైగౌ పోర్టల్‌కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైనాసరే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఒక్కొక్కరికి మూడు ఎంట్రీస్ ఉంటాయి. లోగో ఫార్మాట్ చాలా క్లియర్‌గా ఉండడమే కాకుండా . లోగో గురించి 100 పదాలతో వివరణ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news