బిజినెస్ ఐడియా: ప్రతి నెల రూ.80 వేల ఆదాయం పొందాలంటే ఇలా చెయ్యాలి..

-

ఇంటి దగ్గర నుంచి కదలకుండా బిజినెస్ చెయ్యాలని అందరూ అనుకుంటారు.. అయితే అలాంటి వారికి మంచి బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.అదే పేపర్ ప్లేట్స్, పేపర్ కప్పుల తయారీ.. ముఖ్యంగా జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించిన నేపథ్యంలో చాలామంది ప్లాస్టిక్ ను వాడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పేపర్ తో తయారు చేసే ప్లేట్లు, కప్పులు, గ్లాసులను మీరు తయారు చేసి అమ్మడం వల్ల మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది.

ఇకపోతే రోజు రోజుకు వీటికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మీరు పేపర్ కప్పుల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా లాభం పొందడానికి ఇదే సమయం కాబట్టి ఇలాంటి వ్యాపారాలతో కచ్చితంగా లాభం వస్తుంది..పేపర్ కప్పుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మీకు ముద్ర పథకం కింద లోన్ ఇస్తుంది. ఇక మీరు తక్కువ పెట్టుబడి తో పేపర్ కప్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసుకొని ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఎక్కువ లాభం పొందవచ్చు.

అయితే ఈ పేపర్ కప్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు, యంత్రాలు మీకు మార్కెట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. బాటమ్ రీల్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే 75% ముద్ర పథకం కింద లోన్ తీసుకొని కేవలం 25 శాతం పెట్టబడితే చాలు.. మిగిలినది ప్రభుత్వం అందిస్తుంది..ఒకసారి పెట్టుబడి పెడితే చాలు ఇక ప్రతి నెల అన్నీ ఖర్చులు పోగా 80 వేలు మిగులుతాయి..వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉండటంతో వ్యాపారం క్లిక్ అయితే ఇంకా మంచి లాభాలను పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news