ఏపీ మంత్రికి అస్వస్థత.. హెలికాప్టర్ లో హైదరాబాద్ కి !

-

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి మళ్ళీ అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో అయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి బయలు దేరి వెళ్లారు. ఇటీవల మంత్రి కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈరోజు మళ్ళీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి జ్వరం, నీరసంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ కు పయనం అయ్యారు. అయితే వరదల దృష్ట్యా రోడ్డు మార్గం లేక పోవడంతో ఆయనని హెలికాప్టర్ లో హైదరాబాద్ తీసుకు వెళ్లారు. ఆయన హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందనున్నారు. ఇక ఈ అంశం మీద మరింత సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news