శ్రావణంలో శనివారం ప్రత్యేకత మరియు ఏ పూజ చేస్తే మంచిది

-

శ్రావణమాసం అంటే శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుడుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం, పూజ, ఉపవాసం తదితర ఆచారాలు మనదగ్గర ఏర్పడ్డాయి.

ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం. శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడ, ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. ( ఇది కూడా చదవండి : తిరుమల ఏడుకొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా ?)

చాలామంది తెలుగు ప్రజలు సంతానం లేని వారు సంతానం కోసం ఏడుకొండల వాడికి మొక్కుకునే ఆచారం ఉంది. తమ కోరిక తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణమాసంలో గోవిందం అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర/చెంబు పెట్టి మూడు లేదా ఐదు ఇండ్ల దగ్గర గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్లి బియ్యం తీసుకవచ్చి ఆ బియ్యంతో స్వామికి తియ్యని ప్రసాదం చేసి అందరికీ పంచడం, తామూ స్వీకరించండం వస్తుంది. ఇలా మూడు లేదా ఐదు ఏండ్లు పాటిస్తారు. ఇలా ఆయా ప్రాంతాలలో అనేక ఆచారాలు ఉన్నాయి. శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర ఆరాధన వల్ల శనిబాధలు, ఈతి బాధలు పోతాయి. అంతే కాకుండా స్వామి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నేరవేరుతాయి. ( ఇది కూడా చదవండి : ‘శ్రావణ’ మాసం పరమ పవిత్రం.. ప్రత్యేకత, విశేషాలు)

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news