గోదావరిఖనిలో గంజాయి మత్తులో యువతి హల్ చల్

-

గంజాయి మత్తులో యువత జోగుతుంది. విచ్చలవిడిగా లభిస్తున్న మత్తుకు యువత బానిసలుగా మారుతున్నారు. యదేచ్చగా యువత గంజాయి తీసుకుంటున్న పట్టించుకునే నాధుడే లేడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గంజాయి వినియోగిస్తున్నారు. మైనర్లు సైతం దీనికి బానిసలు అవుతున్నారు.

తాజాగా పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో గంజాయి మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. కరీంనగర్ నుండి గంజాయి మత్తులో ఆటోలో గోదావరిఖని కి చేరుకుంది యువతి. గోదావరిఖని కి చేరుకున్న తర్వాత ఆటో డ్రైవర్ డబ్బులు అడగడంతో ఆ ఆటో డ్రైవర్ ని బూతులు తిడుతూ, అతనిపై దాడి చేస్తూ రెచ్చిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు స్పందించి ప్రశ్నించడంతో వారిపై కూడా దురుసుగా ప్రవర్తించింది ఆ యువతి.

ఇక పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అక్కడి నుండి పారిపోయి తిరిగి కరీంనగర్ కు పారిపోయింది యువతి. అయితే ఆ యువతికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియ రాలేదు. అయితే గోదావరిఖని కి ఎందుకు వచ్చింది, ఆమె ఎక్కడికి వెళుతుందో తెలియాల్సి ఉంది. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news