IND VS ENG :వైజాగ్ లో టీంఇండియాకు తిరుగులేని రికార్డు

-

5 టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ జరిగే రెండో టెస్టుకు కోసం ఇండియా సిద్ధమవుతోంది. అయితే వైజాగ్ లోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియాకు మంచి రికార్డు ఉంది. ఆ స్టేడియంలో ఇప్పటి వరకు 2 టెస్టులు జరగ్గా రెండింట్లోనూ భారత్ గెలిచింది. ఒకసారి సౌతాఫ్రికాను, మరోసారి ఇంగ్లండ్ ను ఇండియా ఓడించింది. రెండుసార్లు ఇండియా మొదటి బ్యాటింగ్ చేసింది.

భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాభవం ఎదురు అయిన సంగతి తెలిసిందే.5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడిన ఇండియా జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఉప్పల్‌లో ముగిసిన మ్యాచ్‌లో రోహిత్ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Read more RELATED
Recommended to you

Latest news