ఇండియాలో కొత్తగా 9,765 కరోనా కేసులు, 477 మరణాలు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక నిన్నటి రోజు తగ్గిన కరోనా కేసులు.. నేడు కాస్త పెరిగి పోయాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త గా 9,765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,06,541 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 99,763 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.55 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 477 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,69, 724 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,548 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,40,37,054 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,24,96,515 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 80,35,261 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news