ఊపిరి పీల్చుకో ఇండియా..దేశంలో ఇవాళ కేవలం 14148 కరోనా కేసులు నమోదు

-

మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గి పోతున్నాయి. అయితే..నిన్న ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం బాగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 14148 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,81,179 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,48,359 కు చేరింది.ఇక దేశం లో కరోనా పా జిటివిటి రేటు 97.82 శాతం గా ఉంది. ఇక దేశంలో తాజాగా 302 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,12,924 కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,76,52,31,385 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 30,49,988 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 30009 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,22,19,896 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news