ఇండియాలో కరోనా కేసులు 14,306 నమోదు..239 రోజుల తర్వాత ఇదే మొదటి సారి !

-

ఇండియాలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ.. మరోక రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం… దేశం లో కొత్తగా గడిచిన 24 గంటల్లో 14,306 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,89,774 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,67,695 కు చేరింది. ఇక దేశంలో తాజాగా 443 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,54,712 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,762 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,35,67,367 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,02,27,12,895 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 60,07,69,717 మందికి కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news