దేశవ్యాప్తంగా కరోనా మృత్యు ఘంటికలు మొగుతున్నాయి. కరొన బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇక, గత 24 గంటల్లో 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలవాగే 357 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారిసంఖ్య 8,102కి చేరుకుంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,86,579 కు చేరింది. అటు 1,41,029 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 49.2 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే 8 రాష్ట్రాలు కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నాయి. అసోం, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, నాగాలాండ్, ఒడిసా, పుదుచ్చేరి, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రికవరీ రేటు ఆశాజనకంగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే 5 వేలకు మించి యాక్టివ్ కేసులు ఉన్నాయి.
8 వేలు దాటిన కరోనా మరణాలు.. ఒక్క రోజులోనే..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
సీఎం మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప దాటడం లేదు : కేసిఆర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు పెట్టి బలుపు దింపాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ...
Ganesh -
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే !
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే ఆయా పార్టీలు జెట్...
Ganesh -
IPL 2024 : ముగిసిన లక్నో ఇన్నింగ్స్… రాజస్థాన్ టార్గెట్ ఎంత అంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్...
Ganesh -