ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

-

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. మ్యాచ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే తైమూర్ ఓరుజ్ గోల్ చేశారు. దీంతో జర్మనీ ముందంజలో నిలిచింది. జర్మనీ మొదటి క్వార్టర్‌లో భారతను ఇరకాటంతో పెట్టింది. కానీ ఆధిక్యాన్నిప్రదర్శించలేకపోయింి. 2 వ క్వార్టర్‌లో సిమ్రంజీత్ సింగ్ చక్కటి ప్రదర్శన కనబర్చారు. కానీ టోమాహాక్ షాక్ ఇచ్చారు. రెండు నిమిషాల్లోనే జర్మనీ మరో రెండు గోల్స్ సాధించింది.

 

దీంతో భారత్ ఇబ్బందుల్లో పడినట్లు అనిపించింది. కానీ హార్దిక్ సింగ్ మొదటి నుంచి రీబౌండ్‌లో స్కోర్ చేయడంతో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్ ఫలితాలు వచ్చాయి. హర్మన్ ప్రీత్ సింగ్ నెట్‌ల వెనుకవైపు అద్భుతమైన డ్రాగ్‌ఫ్లిక్‌తో మరో గోల్ సాధించారు. మూడో క్వార్టర్‌లో రూపిందర్ పాల్ సింగ్, సిమ్రంజీత్ సింగ్ మరో రెండు గోల్స్ చేశారు. దీంతో జర్మనీపై భారత్ విజయం సులభమైంది. చివరిసారిగా 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు  పతకం రావడంతో సంబరాలు అంబరాన్నంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news