IND VS SL : తడబడిన శ్రీలంక…ఇండియా టార్గెట్‌ ఎంతంటే ?

-

మొదటి వన్డే మ్యాచ్‌ లోనే శ్రీలంక టీం తడబడింది. భారత బౌలర్లు నిలకడగా బౌలింగ్‌ చేయడంతో… శ్రీలంక తక్కువ పరుగులే చేయగలిగింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక జట్టు… 50 ఓవర్లలో 262 పరుగులు మాత్రమే చేసి ఏకంగా తొమ్మిది వికెట్ల ను కోల్పోయింది. మొదట ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక జట్టును టీం ఇండియా బౌలర్లు వారిని నిలువరించారు.

ఇక శ్రీలంక బ్యాటింగ్‌ వివరాల్లోకి వస్తే.. ఓపెనర్‌ ఆవిష్కా ఫెర్‌నాండో 32 పరుగులు, భానుకా 27 పరుగులు, కెప్టెన్‌ షనకా 39 పరుగులు మరియు కరుణ రత్నే 43 పరుగులు చేసి శ్రీలంక ను ఆదుకున్నారు. అటు టీం ఇండియా బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌, చాహార్, చాహల్‌ చెరో రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించారు. ఇక టీం ఇండియా గెలవాలంటే.. 50 ఓవర్లలో 263 పరుగులు చేయాల్సి ఉంది.  కాగా.. మొదట టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ్టి మ్యాచ్‌ కొలంబో వేదికగా జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news