Breaking : భార్యకు విడాకులు ఇచ్చిన శిఖర్ ధావన్ ?

-

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ మరియు ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీ తో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా… శిఖర్ ధావన్, తనకు మధ్య సఖ్యత లేదని… తరచూ తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొంది.

అంతేకాదు తన ఇంస్టాగ్రామ్ లో తన భర్త అయిన శిఖర్ ధావన్ ఫోటోలను తొలగించింది ఆయేషా ముఖర్జీ.
అంతేకాదు తన సెకండ్ మ్యారేజ్ ఇక నిలవక పోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తూ చాలా భావోద్వేగానికి గురైంది. ఇక ఇక ఆయేషా ముఖర్జీ పోస్టు… చూస్తూ ఉంటే నిజంగానే శిఖర్ ధావన్ ఆమెకు విడాకులు ఇచ్చాడని అర్థమవుతుంది. అయితే దీనిపై శిఖర్ ధావన్ ఇంకా స్పందించలేదు. కాగా శిఖర్ ధావన్ మరియు ఆయేషా ముఖర్జీకి 2012 సంవత్సరంలో వివాహం జరిగింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అలాగే శిఖర్ ధావన్ తో పెళ్లి అయిన తర్వాత ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది ఆయేషా.

Read more RELATED
Recommended to you

Latest news