BREAKING : కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్..49 పరుగులకే 5 వికెట్లు

-

BREAKING : టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 49 పరుగులకే 5 వికెట్లు పడిపోయాయి. ఇవాళ సౌతాఫ్రికాతో.. టీమిండియా తలపడింది.  సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కు సరైన ఆరంభం దక్కలేదు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ ఔట్ అయ్యాక, రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన కోహ్లీ సైతం అవుటయ్యాడు. ఎంగిడి బౌలింగ్ లో ఫుల్ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చాడు. రోహిత్ (15), రాహుల్( 9 ), విరాట్( 12) లను ఎంగిడి ఒక్కడే అవుట్ చేశాడు. దీపక్ హూడా కూడా డకౌట్ అయ్యాడు. అటు పాండ్యా కూడా 2 పరుగులకే అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 7.3 ఓవర్లలో 49/5 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news