IND vs SL : నేడే పింక్ బాల్ టెస్ట్.. 100 శాతం ప్రేక్షకులకు అనుమతి

-

ఇండియా వర్సెస్‌ శ్రీలం జట్ల మధ్య నేడు… రెండో టెస్టు మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో ఈ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కాబోయే ఈ టెస్టు మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది.

అయితే.. ఈ మ్యాచ్‌ చూడాలను కునే క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం శుభవార్త చెప్పింది. శ్రీలంకతో ఇవాళ జరుగనున్న టెస్టు మ్యాచ్‌ కు 100 శాతం ప్రేక్షకులను అనుమతి ఇచ్చింది. మొదట 50 శాతం ప్రేక్షకులకే అనుమతి ఇవ్వగా… కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో… ఈ నిర్ణయం తీసుకుంది కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం. దీంతో… ఫ్యాన్స్‌ ఫుల్‌ అవుతున్నారు. టికెట్ల కోసం ఎగబడుతున్నారు. కాగా..టీమిండియా క్లీన్ స్వీప్ గురి శ్రీ‌లంక‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్ పై ప‌డింది. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్ప‌టికే ఒక మ్యాచ్ లో భారీ విజ‌యం సాధించి 1-0 తేడాతో ముందు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news