మొదటి టీ 20: ఇండియా, వెస్ట్ ఇండీస్ లకు ఫైన్ విధించిన మ్యాచ్ రిఫరీ రిచర్డ్ సన్

-

నిన్న రాత్రి ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్యన మొదటి టీ 20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో గెలుస్తుంది అనుకున్న టీం ఇండియా కాస్తా ఆఖర్లో బ్యాట్స్మన్ చేతులు ఎత్తేయడంతో ఓటమిళాయింది. ఈ విజయంతో విండీస్ ఈ సిరీస్ లో మొదటిసారి గెలుపు రుచి చూసింది. వెస్ట్ ఇండీస్ నిర్దేశించిన 150 పరుగులు లక్ష్యాన్ని చేధించలేక 145 పరుగులకే పరిమితం అయింది. వెస్ట్ ఇండీస్ బౌలర్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు గెలుపుకు కారణమయ్యారు. అయితే ఈ మ్యాచ్ లు ఇరు జట్లు స్లో గా ఓవర్ ల కోటను ఓపూర్తి చేయడంతో వీరిపై మ్యాచ్ రిఫరీ రిచర్డ్ సన్ మ్యాచ్ ఫీజులో కోతను విధించాడు.

ఇండియా టీం కు మ్యాచ్ ఫీజులో 5 శాతం కొత్త విధించగా, వెస్ట్ ఇండీస్ జట్టుకు 10 శాతం మ్యాచ్ ఫీజును కొత్త విధించాడు. దీనితో వారికి షాక్ తగిలినట్లయింది.. ఇక రెండవ టీ 20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version