ఇండియా VS వెస్ట్ ఇండీస్ మ్యాచ్ కు వరుణుడి గండం …

-

ఈ రోజు ఫ్లోరిడాలో ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన మూడవ టీ 20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ 2 – 1 ఆధిక్యంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ లు రెండు జట్లకు చాలా కీలకం కాగా అందులో ఈ రోజు మ్యాచ్ ను గెలుచుకుంటే సిరీస్ విండీస్ వశమవుతుంది. ఇక ఇండియా ఎలాగైనా రెండు మ్యాచ్ లను గెలుచుకుని సిరీస్ ను గెలవాలని పట్టుదలతో ఉంది. ఇక ఫ్లోరిడా లో వాతావరణ శాఖ తెలుపుతున్న సమాచారం ప్రకారం మ్యాచ్ మధ్యలో వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతోంది. ఇప్పుడు ఈ న్యూస్ భారత్ అభిమానులను కలవరపెడుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం పడి రద్దయినా లేదా వర్షం వలన వెస్ట్ ఇండీస్ కు అనుకూలంగా మారినా సిరీస్ అవకాశాలు పోతాయేమోనన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరి మ్యాచ్ లో ఎమిజరగనుంది అన్నది తెలియాలంటే మరో రెండు గంటలు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news