ఆసియా క్రీడ‌ల్లో భారత్ ఖాతాలో మ‌రో స్వర్ణం

-

ఆసియా క్రీడ‌ల్లో భారత్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణ ప‌త‌కం చేరింది. పురుషుల ఈవెంట్‌ స్క్వాష్‌ ఫైనల్‌లో సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేష్ మంగోంకర్‌లతో కూడిన భారత స్క్వాష్ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకుంది. మొదట భారత స్క్వాష్ జట్టు 0-1తో వెనుకబడినప్పటికీ.. ఆ తరువాత పుంజుకొని 2-1తేడాతో స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. మరోవైపు శనివారం జరిగిన టెన్నిస్ ఈవెంట్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో బొప‌న్న జోడి స్వర్ణం సాధించింది. రెండో సీడ్‌గా బ‌రిలోకి దిగిన బొప‌న్న‌-భోస్లే జోడి తొలి సెట్‌ ఓడినా.. ఆ త‌ర్వాత అద్భుతమైన పోరాటపటిమతో ఆక‌ట్టుకున్నారు.

Asian Games 2023: స్క్వాష్‌లో భారత్ రికార్డ్.. పసిడి పతకం సాధించిన ఇండియా -  NTV Telugu

కాగా ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇది 10వ గోల్డ్ మెడల్ కావడం గమనార్హం. ఆసియా క్రీడల్లో భారత్‌కు నేడు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ జోడి రోహన్ బోపన్న-రుతుజ భోసలే బంగారు పతకాన్ని గెలిచింది. చైనీస్ తైపీకి చెందిన సంగ్-లియాంగ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ భారత్ జోడి 2-6, 6-3, 10-4 తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో మొత్తంగా భారత్ పతకాల సంఖ్య 36కు చేరింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news