WI vs Ind : మిస్టర్ 360 మెరుపులు..ఇండియా గ్రాండ్ విక్టరీ

-

టి20 సిరీస్ లో టీమిండియా మళ్లీ గాడిన పడింది. నిన్న రాత్రి జరిగిన మూడో టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు పై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించింది. వెస్టిండీస్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ లో అదరగొట్టాడు.

కేవలం 44 బంతుల్లోనే 76 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. విండీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ సేన.. మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి, 164 పరుగులు చేసింది.

అయితే ఆ లక్ష్యాన్ని ఆరు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా చేదించి, విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటి వరకు టీమిండియా రెండు విజయాలు నమోదు చేసుకోగా… వెస్టిండీస్ జట్టు ఒక మ్యాచ్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో టీమిండియా ఒక్క మ్యాచ్ గెలిస్తే, సిరీస్ కైవసం చేసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news