మునుగోడు ఉప ఎన్నిక కమిటీ ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ

-

మునుగోడు ఉప ఎన్నిక పై కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రాజగోపాల్ రాజీనామా చేసిన గంటలోపే మునుగోడు ఉప ఎన్నిక కమిటీ ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. మునుగోడు ఉప ఎన్నిక కమిటీ ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. స్ట్రాటజీ, ప్రచార కమిటీని నియమించింది.  మధుయాష్కీ కన్వీనగర్‌గా కమిటీ ఏర్పాటు, సభ్యులుగా దామోదర్‌రెడ్డి, బలరాం నాయక్‌, సీతక్క, అంజన్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌, సంపత్ లను నియామకం చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై భట్టి విక్రమార్క స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ఖండిస్తున్నానని.. రాజకీయాల్లో రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్సే అవకాశమిచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ దేశానికి చేస్తున్న అన్యాయాలపై సోనియా పోరాటం చేస్తున్నారు, సోనియాపై కక్ష్యగట్టి బీజేపీ ఈడీ దాడులు చేస్తోందని ఫైర్ అయ్యారు.  సోనియాకు మద్దతుగా నిలవాల్సిందిపోయి ఇలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నానని వెల్లడించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news