పంత్ కోలుకోవాలని..100 కోబ్బరి కాయలు కొట్టిన సూర్య !

-

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఇటీవల కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే, కారు ప్రమాదంలో గాయాల పాలై చికిత్స పొందుతున్న టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, మరో 18 నెలల పాటు క్రికెట్ ఆడటం కష్టమేనని తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా, న్యూజిలాండ్ తో మూడో వన్డే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మంగళవారం జరగనుంది.

మ్యాచ్ కోసం టీమిండియా కివీస్ జట్లు ఇప్పటికే ఇండోర్ కు చేరుకున్నాయి. కాగా సోమవారం ఉదయం భారత క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా పంత్ త్వరగా కోలుకోవాలని మహా శివుడికి పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగానికి బాబా మహాకాల్ భస్మహారతి అర్పించారు. అంతేకాదు, పంత్‌ కోసం సూర్య 100 కొబ్బరి కాయలు కొట్టినట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఏఎన్ఐ ట్విటర్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news