పిఠాపురంలో ఎవ్వరూ పోటీ చేసినా పవన్ దే గెలుపు : ఉదయ్ శ్రీనివాస్

-

పిఠాపురంలో ఎవ్వరూ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని కాకినాడ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈనెల 31 నుంచి పిఠాపురంలో పవన్ వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. పవన్ కి సవాల్ విసరాలంటే ద్వారంపూడికి స్థాయి ఉండాలి. మా నాయకుడికి భయపడి వైసీపీ మండలానికి ఒక ఇన్ చార్జీని నియమించింది. ముద్రగడ వైసీపీ కోసమే పని చేశారు. అందుకే ఆ పార్టీలో చేరారు అని తెలిపారు ఉదయ్ శ్రీనివాస్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి విజయం సాధించాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సరికొత్త మార్పులు తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు సర్వే చేయించామని.. పిఠాపురం నుంచి పవన్  దాదాపు లక్ష మెజార్టీతో గెలుపొందబోతున్నట్టు  స్పష్టం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news