బ్రేకింగ్ : సెప్టెంబర్ 30 వరకు రైళ్లు బంద్..!

-

కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. రోజు వేల సంఖ్యలో కరోనా‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును వచ్చే నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని పేర్కొంది.

నిజానికి వీటి సేవలను ఈ నెల 12 వరకు రద్దు చేస్తున్నట్టు జూన్ 25న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. రేపటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రయాణీకులు కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,34,945 కరోనా యాక్టివ్‌ కేసులుండగా, 15,35,743 డిశ్చార్జి కేసులున్నాయి. వైరస్‌ ప్రభావంతో 43,386 మంది చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news