మళ్లీ అంబానీయే నంబర్ 1.. ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్

-

ముకేశ్ అంబానీ అపరకుబేరుడిగా మళ్లీ నంబర్ వన్ ప్లేస్ లో నిలిచారు. గౌతమ్‌ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్‌ డాలర్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత భారతీయ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ నివేదిక-2023  స్పష్టం చేసింది. అలాగే ప్రపంచ టాప్‌-10 కుబేరుల్లో భారత్‌ నుంచి ఈసారి ముకేశ్‌కు మాత్రమే చోటు దక్కింది. ఆయన 9వ స్థానంలో ఉన్నారు.

ఇక 53 బిలియన్‌ డాలర్లతో అదానీ గ్రూప్‌ సంస్థల అధిపతి గౌతమ్‌ అదానీ దేశీయ ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్నారు. నిజానికి నిరుడుతో పోల్చితే ముకేశ్‌ సంపద 20 శాతం (21 బిలియన్‌ డాలర్లు) క్షీణించింది. అయినా అదానీ సంపద ఏకంగా 60 శాతం పడిపోవడంతో నెంబర్‌ 1కు వచ్చారు. హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌ నేపథ్యంలో అదానీ సంపద పెద్ద ఎత్తున కరిగిపోయిన విషయం తెలిసిందే. గరిష్ఠ సంపద స్థాయి నుంచి సగటున వారానికి రూ.3,000 కోట్లు నష్టపోయినట్టు తేలింది. అదానీ గ్రూప్‌ సంస్థలు అవకతవకలకు పాల్పడ్డాయంటూ ఈ ఏడాది జనవరి 24న అమెరికాకు చెందిన షార్ట్‌-సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ రిపోర్టునిచ్చిన సంగతి విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news