ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరిగింది – VH

-

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ హనుమంతరావు స్పందించారు. పీసీసీ కోసం పెద్ద కమిటీ వేశారని.. కానీ అందులో ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరిగిందన్నారు వి హనుమంతరావు. కమిటీలో ఉన్న వారిని రాజీనామా చేయాలని తాము అడగలేదని స్పష్టం చేశారు. జండా మోసిన వాళ్లకు స్థానం కల్పించాలని కోరామన్నారు.

ఈ సమస్యను పరిష్కరించమని అధిష్టానం సీనియర్ నేత దిగ్విజయ సింగ్ ని నియమించిందని.. ఇది మంచి పరిణామం అన్నారు. దిగ్విజయ్ సింగ్ కు రాష్ట్రంలోని అన్ని పరిస్థితులు తెలుసన్నారు వి హనుమంతరావు. ఆయనకు అందరితో పరిచయాలు ఉన్నాయని.. అందరికీ న్యాయం చేస్తాడని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతల మీటింగ్ వాయిదా వేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news