అసెంబ్లీకి రాకుండా టీవీ9 ఆఫీస్ కి వెళ్ళాడు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం చీడను విరగడ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ‘అసెంబ్లీకి రాని దద్దమ్మలు.. బడికి రాని బడి దొంగల్లాంటోళ్లు. మరి అలాంటి బడి దొంగ నిన్న టీవీ9 ఆఫీసులో 4 గంటలు కూర్చున్నాడు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో మా కళ్లల్లోకి చూసే ధైర్యం లేక, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

త్వరలో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాకతీయ వర్సిటీని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. కొంత మంది అధికారం పోయి తోక తెగిన బల్లులా ఎగురుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news